News July 15, 2024
‘Xiaomi ఇండియా’ పతనానికి కారణాలు ఇవే..!

ఒకప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ను ఏలిన ‘Xiaomi ఇండియా’ కంపెనీ షేర్ వేగంగా పడిపోతోంది. చైనాపై వ్యతిరేకత, సీఈవో మను కుమార్ జైన్ రాజీనామా, లీగల్ ఇష్యూస్, అధిక సంఖ్యలో మోడల్స్ రిలీజ్ చేయడం వల్ల కస్టమర్లు అయోమయానికి గురికావడం కారణంగా తెలుస్తోంది. మరోవైపు వివో, ఒప్పో బ్రాండ్లు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మన దేశంలో Xiaomi మార్కెట్ షేరే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Similar News
News October 20, 2025
మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?
News October 20, 2025
దీపావళి.. లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.
News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.