News July 15, 2024
‘Xiaomi ఇండియా’ పతనానికి కారణాలు ఇవే..!

ఒకప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ను ఏలిన ‘Xiaomi ఇండియా’ కంపెనీ షేర్ వేగంగా పడిపోతోంది. చైనాపై వ్యతిరేకత, సీఈవో మను కుమార్ జైన్ రాజీనామా, లీగల్ ఇష్యూస్, అధిక సంఖ్యలో మోడల్స్ రిలీజ్ చేయడం వల్ల కస్టమర్లు అయోమయానికి గురికావడం కారణంగా తెలుస్తోంది. మరోవైపు వివో, ఒప్పో బ్రాండ్లు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మన దేశంలో Xiaomi మార్కెట్ షేరే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Similar News
News February 8, 2026
జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.
News February 8, 2026
కలర్ ఫుల్గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ!

ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే గ్రే/బ్లాక్ కలర్ షేడ్లో ఉంటాయనే పేరుంది. అయితే ఎన్టీఆర్తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్గా ఉండనుందని తెలుస్తోంది. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొత్త టేకింగ్తో తీస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సన్నబడిన ఆయన భారీగా గడ్డం కూడా పెంచారు. కాగా సమ్మర్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్.
News February 8, 2026
రెండో టీ20కి భారత జట్టుతో చేరనున్న సుందర్: సూర్య

గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ రెండో టీ20కి అందుబాటులో ఉంటారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగే మ్యాచులో జట్టులో చేరుతారని పేర్కొన్నారు. న్యూజిలాండ్తో తొలి వన్డే సమయంలో సుందర్ గాయపడ్డారు. ఆ సిరీస్లో సుందర్ స్థానంలో బదోనిని తీసుకున్నా T20WC స్క్వాడ్లో మాత్రం ఆయన స్థానాన్ని రీప్లేస్ చేయలేదు. ఆల్రౌండర్ సుందర్ రాకతో భారత్ మరింత పటిష్టంగా మారనుంది.


