News April 24, 2024
రెండో దశ ఎన్నికల్లో ధనవంతులు వీరే

కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ రూ.622 కోట్ల ఆస్తులతో రెండో దశ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్లు, యూపీలోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని రూ.278 కోట్లతో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Similar News
News February 3, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 3, 2026
గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.
News February 3, 2026
ఆ నివేదిక వచ్చాకే రైతులకు రూ.6వేలు!

TG: సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ వర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టు ఈ నెల 6వ తేదీకల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారీ నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీని ప్రభావం రైతులకు రూ.6వేలు చొప్పున అందాల్సిన 2వ విడత రైతు భరోసాపై పడింది. ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు.


