News September 6, 2024

వినేశ్, బజ‌రంగ్ పోటీ చేసే స్థానాలు ఇవే

image

కాంగ్రెస్‌లో చేరిన రెజ్ల‌ర్ వినేశ్ ఫొగట్ హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జులానా స్థానం నుంచి పోటీ చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అలాగే మ‌రో రెజ్ల‌ర్ బజ‌రంగ్ పునియా బాద్లీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జులానా నియోజ‌క‌వ‌ర్గం సంప్రదాయ మ‌ల్ల‌యోధుల‌కు పెట్టింది పేరు. బాద్లీ ఢిల్లీ-గురుగ్రామ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండి అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్న కీలక పట్టణం.

Similar News

News November 12, 2025

GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

image

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.

News November 12, 2025

నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

image

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.

News November 12, 2025

ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

image

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.