News April 8, 2024
తట్టు (మీజిల్స్) లక్షణాలు ఇవే

తట్టు సోకిన వారిలో తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, నోటిలో మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతాయని, వ్యాధి సోకిన 7-14 రోజుల్లో శరీరంపై ప్రభావం చూపుతుందని తెలిపారు. దగ్గు, తుమ్ముల ద్వారా ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని సూచిస్తున్నారు.
Similar News
News July 9, 2025
రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.
News July 9, 2025
దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్లో<<>> పర్యటించారు.
News July 9, 2025
ఏపీ సీఎంకు తెలంగాణ MLA విజ్ఞప్తి

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట MLA వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన CMను డ్యాంపైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై MLA వినతిపత్రం ఇచ్చారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి AP నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తైతే 100KM దూరం తగ్గుతుందని వివరించారు.