News April 24, 2024

ఈ ఎంపీ అభ్యర్థులు చాలా రిచెస్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో పలువురు అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,598.65 కోట్లతో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ₹4,568 కోట్లు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹715.62 కోట్లు, కడప కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ₹182 కోట్లతో ఉన్నారు.

Similar News

News April 9, 2026

భూమి, చంద్రుడి HD ఫొటోలు

image

‘ఆర్టెమిస్-2’ ప్రయోగంలో భాగంగా అంతరిక్షం నుంచి తీసిన చంద్రుడు, భూమి హైక్వాలిటీ ఫొటోలను నాసా విడుదల చేసింది. బూడిద రంగులో జాబిల్లి కనువిందు చేస్తుండగా, భూమి నెలవంక అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో ఉన్నారు.

News April 9, 2026

విద్యార్థులకు అలర్ట్.. ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ క్యాంపులు

image

AP: ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు, రెండో విడతలో ఈ నెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.

News April 9, 2026

ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. వసూలుకు ఇరాన్ ప్లాన్

image

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున ఫీజు విధించాలని ప్లాన్ చేస్తోందని Financial Times తెలిపింది. క్రిప్టోకరెన్సీలో పేమెంట్స్ తీసుకోవాలని అనుకుంటోందని చెప్పింది. జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించే ముందు ట్యాంకర్‌లోని సరకులను పరిశీలించనుందని అక్కడి అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.