News November 16, 2024

ఈ పెట్స్ చాలా కాస్ట్లీ గురూ!

image

జంతువులు, పక్షుల పెంపకం కొంతమందికి హాబీ. మరి కొంతమందికి అవసరం. కానీ కొందరికి మాత్రం అవి స్టేటస్ సింబల్. అందుకే కొన్ని పక్షులు, జంతువులు సామాన్యుడు కనీసం ఊహించలేని ధర పలుకుతుంటుంటాయి. వాటిలో కొన్ని చూస్తే..
టిబెటన్ మాస్టిఫ్: రూ.20 లక్షలు
సవానా పిల్లి: రూ.42 లక్షలు
హయాసింత్ మకావ్: రూ.40 లక్షలు
పామ్ కోకటూ: రూ. 17 లక్షల వరకు
కోయ్ చేపలు: రూ.1.5 లక్షలు

Similar News

News January 6, 2026

బిట్‌కాయిన్ స్కామ్.. శిల్పా శెట్టి భర్తకు కోర్టు నోటీసులు

image

బిట్‌కాయిన్ స్కామ్‌లో హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న PMLA ప్రత్యేక కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. బిట్‌కాయిన్ పోంజీ స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి ఆయన 285 బిట్‌కాయిన్లు (రూ.150 కోట్లకు పైగా విలువ) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 19న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

News January 6, 2026

చలిగా ఉందని వేడి నీటితో స్నానం చేస్తున్నారా?

image

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం హాయిగా అనిపించినా లేనిపోని సమస్యలొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగలు కక్కే నీటితో స్నానం చేస్తే ‘చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఆపై చర్మం పొడిగా మారి దురద, పగుళ్లు ఏర్పడతాయి. తలస్నానం చేస్తే జుట్టు పొడిబారి, బలహీనమై రాలిపోతుంది. శరీర ఉష్ణోగ్రతతో పాటు బీపీ పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి’ అని సూచిస్తున్నారు.

News January 6, 2026

రెండు సార్లు ఫెయిలై మూడోసారి సక్సెస్

image

హైడ్రోఫోనిక్ విధానంలో తొలుత ఆశించిన విధంగా కూరగాయల దిగుబడి రాలేదు. 2సార్లు ఫెయిలై మూడోసారి సక్సెస్ అయ్యారు. ఇంట్లో వాడుకోగా మిగిలినవి అమ్మాలనుకున్నారు. మార్కెట్‌లో బ్రకోలీ, క్యాబేజీ, ఇతర ఆకుకూరలకు డిమాండ్ ఉందని గ్రహించి.. తన ఇంట్లోనే దాదాపు అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, మైక్రోగ్రీన్స్ సాగు చేస్తూ.. ‘బ్లూమ్ ఇన్ హైడ్రో’ పేరుతో స్థానిక రెస్టారెంట్లు, హోటల్స్, కెఫేలకు అందిస్తూ మంచి లాభాలు సాధించారు.