News September 3, 2025
గణపతి నిమజ్జనాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: TG పోలీస్

❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.
Similar News
News September 3, 2025
మహిళల ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.
News September 3, 2025
గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
News September 3, 2025
హరీశ్ వల్లే వారంతా పార్టీని వీడారు: కవిత

TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.