News March 17, 2024
‘144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇవి చేయకూడదు’

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని కమిషనర్ సునీల్ దత్ ప్రకటించారు. ఆంక్షలు అమలులో వున్నందున పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్ బంద్ చేయాలన్నారు.
Similar News
News September 9, 2025
ఖమ్మం: పోక్సో కేసుల్లో నిందితులు తప్పించుకోలేరు: డీసీపీ

18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో చట్టం కఠినంగా అమలవుతోందని, నిందితులు తప్పించుకునే అవకాశం లేదని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన భరోసా కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి మాట్లాడుతూ.. పోక్సో కేసుల్లో రాజీకి అవకాశం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు పడతాయని తెలిపారు.
News September 8, 2025
స్థానిక ఎన్నికల జాబితాపై అఖిలపక్ష సమావేశం

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితాపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
News September 8, 2025
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.