News September 25, 2024

ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!

image

ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.

Similar News

News September 25, 2024

డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి

image

తనపై నార్సింగి పీఎస్‌లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.

News September 25, 2024

Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్‌లిస్ట్

image

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్‌ అని చెప్పారు.

News September 25, 2024

బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం

image

AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.