News April 12, 2025

ఈ పదార్థాలు హానికరం: వైద్యులు

image

మనం రోజూ తినే కొన్ని ఆహారాల్లో పెట్రోల్ నుంచి సేకరించిన పదార్థాలు వాడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రాసెస్ చేసిన మిల్లెట్స్, ఆలూ చిప్స్, చాక్లెట్స్ ద్వారా పెట్రోల్ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. చిప్స్ పాడవకుండా టెర్షియరీ బ్యుటైల్ హైడ్రోక్వినన్ వాడతారు. అలాగే డోనట్స్‌‌‌లో పెట్రోల్ నుంచి సేకరించిన ప్రొపైలిన్ గ్లైకాల్
& ఐస్‌క్రీమ్స్, సలాడ్స్‌లో ఎమల్సిఫైయర్ వాడతారు’ అని సూచించారు.

Similar News

News January 17, 2026

తల్లి దగ్గరకు వెళ్లగానే పిల్లలు ఏడుపు మానేసేది ఇందుకే!

image

నవజాత శిశువులకు వాసనను గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తల్లి పాలలో ఉండే ప్రత్యేకమైన సువాసనను వారు ఇట్టే పసిగట్టగలరు. అందుకే ఆకలి వేసినప్పుడు శిశువు తన తలని తల్లి వైపు తిప్పుతుంటారని ఇందులో తెలిసింది. అలాగే శిశువులు వారి తల్లి డ్రెస్ వాసనను బట్టి ఏడుపు ఆపివేస్తారని మరో పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా? COMMENT

News January 17, 2026

ICMR-NIIRNCDలో ఉద్యోగాలు

image

<>ICMR<<>>-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(NIIRNCD) 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://niirncd.icmr.org.in

News January 17, 2026

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ: CM

image

AP: చరిత్ర తిరగరాయడంలో తెలుగువాళ్లు ముందున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కాకినాడలో AM గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమ ఇది. 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఏడాది క్రితం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా ఎగుమతి చేస్తాం’ అని పేర్కొన్నారు.