News October 7, 2025

జామాకులనూ ఆన్‌లైన్‌‌లో అమ్మేస్తున్నారు!

image

ఎండిన, పచ్చి జామాకులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ బాగా పెరిగింది. వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్‌ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Similar News

News April 9, 2026

YSR మరణం.. జగన్‌పై అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్

image

AP: YSR చనిపోవడానికి ముందే జగన్ CM పదవి కోసం సంతకాలు తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏంటని సందేహాలు వ్యక్తం చేశారు. ‘2019లో తండ్రి చావును సింపతీగా చూపి పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మలేదు. CBN గెలుస్తారని సర్వేలు చెప్పాయి. దీంతో సొంత బాబాయిని అడ్డంగా నరికిన విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు’ అని అన్నారు.

News April 9, 2026

సొంత ఇల్లు, కారు లేవు.. దేశంలోనే పేద సీఎం మమత!

image

తనకు సొంత ఇల్లు, కారు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 9.8 గ్రాముల బంగారం, రూ.75,700 నగదు ఉందని తెలిపారు. మొత్తంగా రూ.15.37 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలో పేద సీఎంగా మమత నిలిచారు. ఆమె తర్వాతి స్థానాల్లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(రూ.55 లక్షలు), కేరళం సీఎం పినరయి విజయన్(రూ.కోటి) ఉన్నారు.

News April 9, 2026

దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

image

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It