News September 24, 2025

పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు: హరీశ్

image

TG: కృష్ణా జలాల వాటాలో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. వీళ్ల అజ్ఞానం వల్ల నీటి వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. 763 TMCలు ఇవ్వాలంటూ KCR గతంలో పట్టుబట్టారని గుర్తుచేశారు. CBNకు భయపడి బనకచర్లపై మౌనం వహించిన రేవంత్, ఇప్పుడు కర్ణాటకలోని INC ప్రభుత్వం కోసం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

Similar News

News September 24, 2025

ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

image

AP: మన్యం, VZM, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ నెల 26న వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని తెలిపింది. అది 27న దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే ఛాన్సుందని తెలిపింది. ఈ సందర్భంగా కోస్తా జిల్లాల్లో 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

News September 24, 2025

ఇప్పటికే కొన్న OG టికెట్స్ పరిస్థితి ఏంటి?

image

TG: రేపు విడుదలకానున్న పవన్ OG మూవీ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు GOను <<17815121>>TG హైకోర్టు<<>> సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న తలెత్తింది. రేపటికి దాదాపుగా అన్ని షోలకు టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో టికెట్ల డబ్బులు, అన్ని టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News September 24, 2025

BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

image

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.