News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి

AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.
Similar News
News February 5, 2026
USతో ట్రేడ్ డీల్.. భారత్పై పాక్లో ప్రశంసలు

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత పాక్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా PM షరీఫ్ సుంకాల విషయంలో పురోగతి సాధించలేకపోయారని ఆ దేశ పౌరులు ఫైరవుతున్నారు. ఏం చేసినా గౌరవాన్ని కొనలేరని నిరూపితమైందన్నారు. పాక్ను చట్టవిరుద్ధమైన పనులు చేసే ఉంపుడుగత్తెలా ట్రంప్ చూశారని మండిపడుతున్నారు. భారత నాయకత్వం దేశం దాటకుండానే అద్భుతం చేసిందని కొనియాడుతున్నారు.
News February 5, 2026
పశువుల పాలను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పశువుల పాలను తీసే సమయంలో డెయిరీఫామ్ నిర్వహించేవారు, పాడి రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పాలను సేకరించాలని, పొదుగు నుంచి పాలను పూర్తిగా తీయకుండా వదిలేయడం మంచిది కాదంటున్నారు. మిల్క్ సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు మంచి ధర ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 5, 2026
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పోస్టులు

<


