News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.
News February 2, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటన.. విచారణకు హాజరైన ఈవో, ఎస్పీ
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తిరుపతి కలెక్టరేట్లో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. గత నెల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, 40 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
News February 2, 2025
నాని ‘ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.