News October 31, 2024
IPLతో అత్యధికంగా ఆర్జించింది వీరే

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL ద్వారా ఇప్పటివరకు రూ.194.6 కోట్లు సంపాదించారు. టోర్నీ చరిత్రలో హిట్ మ్యాన్దే అత్యధిక ఆర్జన. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (రూ.188.84 కోట్లు), విరాట్ కోహ్లీ (188.2 కోట్లు), రవీంద్ర జడేజా (125.01 కోట్లు), సునీల్ నరైన్ (113.25 కోట్లు) ఉన్నారు. సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్వెల్, యువరాజ్ సింగ్ కూడా అత్యధికంగా ఆర్జించారు.
Similar News
News January 8, 2026
విజయ్ ‘జననాయగన్’ వివాదం ఏంటంటే?

నిర్మాత సెన్సార్ సర్టిఫికెట్ కోసం DEC 19న CBFCకి సినిమా చూపించారు. కొన్ని కట్స్ చేసుకొని వస్తే U/A సర్టిఫికెట్ ఇస్తామని బోర్డు చెప్పడంతో మార్పులు చేసి 24న మూవీని సబ్మిట్ చేశారు. కానీ బోర్డు నుంచి రెస్పాన్స్ లేదు. మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉందంటూ సినిమాను JAN 5న రివైజింగ్ కమిటీకి పంపారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సర్టిఫికెట్ త్వరగా ఇచ్చేలా ఆదేశించాలని ప్రొడ్యూసర్ <<18789554>>కోర్టును<<>> ఆశ్రయించారు.
News January 8, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 8, 2026
వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.


