News July 5, 2024
రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: నాదెండ్ల

AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్ మాఫియాలో ఈ వాహనాల నిర్వాహకులే ప్రధాన సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2026
RCB Vs SRH.. పైచేయి ఎవరిదంటే?

IPLలో RCB, SRH మధ్య ఇప్పటిదాకా 26 మ్యాచ్లు జరిగాయి. 11 సార్లు RCB, 14 సార్లు SRH గెలిచాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. 2024 ఎడిషన్లో SRH అత్యధిక స్కోరు(287/3) నమోదు చేయగా, 2022లో RCB అత్యల్ప పరుగులు(68/10) చేసింది. బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ SRHపై 805 రన్స్ చేశారు. ఆ జట్టుపై ఎక్కువ మ్యాచ్లు(24) ఆడింది కూడా కోహ్లీనే. రేపు రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది.
News March 28, 2026
ఎలాంటి సమస్య రాదు.. ప్రభుత్వాన్ని నమ్మండి: అమిత్ షా

దేశంలో ఎలాంటి సమస్య రాదని, ఆయిల్, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. రూమర్లను నమ్మి పానిక్ కావద్దని, ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. ఏ యుద్ధంలోనూ జోక్యం చేసుకోవాలని భారత్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై స్పందిస్తూ.. సంక్షోభం భారాన్ని తనపై వేసుకున్న దేశం ఇండియా ఒక్కటేనని, ప్రపంచంలో ఇంకోటి లేదని Times Now సమ్మిట్లో అన్నారు.
News March 28, 2026
ఎలాంటి సమస్య రాదు.. ప్రభుత్వాన్ని నమ్మండి: అమిత్ షా

దేశంలో ఎలాంటి సమస్య రాదని, ఆయిల్, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. రూమర్లను నమ్మి పానిక్ కావద్దని, ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. ఏ యుద్ధంలోనూ జోక్యం చేసుకోవాలని భారత్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంపై స్పందిస్తూ.. సంక్షోభం భారాన్ని తనపై వేసుకున్న దేశం ఇండియా ఒక్కటేనని, ప్రపంచంలో ఇంకోటి లేదని Times Now సమ్మిట్లో అన్నారు.


