News July 5, 2024
రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: నాదెండ్ల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1718805569839-normal-WIFI.webp)
AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్ మాఫియాలో ఈ వాహనాల నిర్వాహకులే ప్రధాన సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2024
హిండెన్బర్గ్ వివాదం.. దర్యాప్తు చేపట్టిన కోటక్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719899164556-normal-WIFI.webp)
కింగ్డన్ క్యాపిటల్ తమ సంస్థ వేదికగా అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్కు పాల్పడటంపై కోటక్ గ్రూప్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హిండెన్బర్గ్తో కింగ్డన్కు సంబంధాలు ఉన్నాయని ముందే తెలిస్తే అసలు FPI అకౌంట్నే ఓపెన్ చేసే వాళ్లము కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కింగ్డన్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం దాచిందని అనుమానిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు లభిస్తే కోటక్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News July 8, 2024
ఉచిత ఇసుకపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720054576488-normal-WIFI.webp)
AP: ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
News July 8, 2024
సెలబ్రెటీల వెడ్డింగ్కు జోసెఫ్ రాధిక్ ఉండాల్సిందే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720428077948-normal-WIFI.webp)
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకను ఇంటర్నేషనల్ అవార్డీ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధిస్తున్నారు. ఈయన రోజుకు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారట. కత్రినా కైఫ్- విక్కీ, కోహ్లీ – అనుష్క, సిద్ధార్థ్- కియారా వివాహాలకు పనిచేశారు. కార్పొరేట్లో మూడేళ్లు పని చేశారు. ఫొటోస్ తీయడంలో సంతృప్తి ఉండటంతో 2010లో ఫొటోగ్రాఫర్గా మారారు. ఇప్పుడు సెలబ్రెటీలు సైతం కోరుకునేంత ఎత్తుకు ఎదిగారు.