News July 5, 2024

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: నాదెండ్ల

image

AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్ మాఫియాలో ఈ వాహనాల నిర్వాహకులే ప్రధాన సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

image

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.

News November 18, 2025

గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

image

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.