News December 31, 2024
డిజిటల్ మోసాల్లో వారే అధికం: సజ్జనార్

వృద్ధులు సైబర్ మోసాల బారిన పడటానికి ఓ రకంగా వారి పిల్లలే కారణమని టీజీఆర్టీసీ MD సజ్జనార్ ట్వీట్ చేశారు. వృద్ధాప్యంలో వారిని సరిగా పట్టించుకోకపోవడం సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా మారుతోందని తెలిపారు. సైబర్ నేరాల బాధితుల్లో వీరి సంఖ్యే ఎక్కువని పేర్కొన్నారు. వారి కదలికలపై పిల్లలు నిఘా పెట్టాలని సూచించారు. HYDలో వృద్ధుడైన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.9.50లక్షలను కేటుగాళ్లు కాజేసిన వార్తను ఆయన షేర్ చేశారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


