News November 1, 2024

ఎగబడి కొన్నారు.. అంతలోనే వదిలేశారు..!

image

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను గత ఐపీఎల్ వేలంలో KKR ఎగబడి మరీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.24.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ పట్టుమని పది నెలలు కూడా గడవకముందే అతడిని వదిలేసింది. గత సీజన్‌లో ఫెయిల్ కావడం వల్లే ఆ ఫ్రాంచైజీ వదిలేసినట్లు టాక్. కాగా ఈ నెలలో జరగబోయే మెగా వేలంలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 6, 2025

నితీశ్‌ కొడుకు రాజకీయాల్లోకి రావొచ్చు: JDU నేత

image

బిహార్‌ CM నితీశ్‌కుమార్‌ తనయుడు నిశాంత్‌ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. JDU జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. నిర్ణయం మాత్రం ఆయనదే” అని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో నిశాంత్ పోటీ చేయకపోయినా కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News December 6, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in

News December 6, 2025

పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

image

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.