News October 20, 2025
వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్గఢ్లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.
Similar News
News October 20, 2025
సదర్ ఉత్సవాల్లో కిషన్రెడ్డి సందడి

TG: HYD కాచిగూడలోని చప్పల్ బజార్లో యాదవుల సదర్ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి చేశారు. ‘ఆల్ ఇండియన్ ఛాంపియన్ బుల్స్’కు స్వాగతం పలికారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని, దున్న రాజుల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
News October 20, 2025
BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 20, 2025
కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.