News October 30, 2024
వారికి టెన్త్లో పాస్ మార్కులు 10 మాత్రమే

AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2026
T20 WC: 2009-2026.. తగ్గేదేలే

T20 వరల్డ్ కప్లో ఈ ఏడాది యువ క్రికెటర్లతో పాటు సీనియర్లూ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 2009 T20 WCలో ఆడిన పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), అదిల్ రషీద్(ఇంగ్లండ్), వాన్డెర్ మెర్వ్ (సౌతాఫ్రికా-2009, నెదర్లాండ్స్-2026) తాజా ఎడిషన్లోనూ ఆడబోతున్నారు. కాగా 2009లో టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పుడు ఎవరూ టీమ్లో లేరు. కానీ అప్పుడు ప్లేయర్గా ఆడిన గంభీర్ ఇప్పుడు హెడ్ కోచ్గా ఉన్నారు.
News February 5, 2026
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
News February 5, 2026
BIG BREAKING: ఒకే రోజు రూ.20,000 తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్ రేటు రూ.20,000 తగ్గి రూ.3 లక్షలకు చేరింది. ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే మళ్లీ రేట్లు పతనమయ్యాయి.


