News November 17, 2024

టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేశారు!

image

పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో. టీచర్ మీద కోపంతో బాంబు తయారుచేసి పేల్చారు. హరియాణాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. ఇది మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్‌లో చూసి చిన్న బాంబు తయారుచేశారు. టీచర్ చైర్ కింద పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఈ ఘటనలో టీచర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో వదిలిపెట్టారు.

Similar News

News November 10, 2025

శుభ సమయం (10-11-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ పంచమి ఉ.7.55 వరకు
✒ నక్షత్రం: పునర్వసు రా.1.17 వరకు
✒ శుభ సమయాలు: ఉ.6.30-7.10, రా.7.40-8.10
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34
✒ వర్జ్యం: మ.1.51-మ.3.22
✒ అమృత ఘడియలు: రా.11.00-రా.12.32

News November 10, 2025

TODAY HEADLINES

image

➧ కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్
➧ అనారోగ్యమే అసలైన పేదరికం: సీఎం చంద్రబాబు
➧ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
➧ వారంలో TG TET నోటిఫికేషన్?
➧ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి.. బిహార్ ప్రచారంలో లోకేశ్
➧ ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP
➧ డిసెంబర్ 15న IPL వేలం!

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.