News July 31, 2024

వాటికి యునెస్కో గుర్తింపు తీసుకురావాలి: జాస్తి వీరాంజనేయులు

image

AP: రాష్ట్రంలో 129 కట్టడాల్లో ఒక్కదానికీ యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కలేదని అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరం, అతి పెద్ద ఏకశిలా నంది, అతి పెద్ద 7 పడగల నాగేంద్రుడు, 856 స్తూపాల ఆలయం, వేలాడే ధ్వజస్తంభం, 12 ధ్వజస్తంభాలతో కూడిన నాట్య మండపాల గుర్తింపునకు ప్రభుత్వం క‌ృషి చేయాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 8, 2026

అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

image

మస్క్ నేతృత్వంలోని Xకు కేంద్ర IT శాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. Grok AI ద్వారా అశ్లీల చిత్రాలను సృష్టిస్తున్న ఉదంతంపై X సమర్పించిన నివేదిక సరిపోదని చెప్పింది. ఈ అశ్లీల కంటెంట్‌పై తీసుకున్న నిర్దిష్ట చర్యలు, భవిష్యత్తులో జరగకుండా చేపట్టే నివారణా మార్గాల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. భారత చట్టాలను గౌరవిస్తామని X చెబుతున్నా కచ్చితమైన వివరాలు సమర్పించాల్సిందేనని కేంద్రం ఆదేశించింది.

News January 8, 2026

భార్య, పిల్లల ముందు ఇలా మాట్లాడుతున్నారా?

image

భార్య, పిల్లల ముందు దుర్భాషలాడకూడదని, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. కుటుంబ యజమాని ప్రవర్తన ఇంటి ప్రశాంతతను నిర్ణయిస్తుంది. ఆయన మాటలు పిల్లల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. భార్యను, ఆమె పుట్టింటిని కించపరచడం మంచిది కాదు. కోపమొచ్చినా గౌరవం తగ్గకుండా ప్రవర్తించాలి. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకున్నప్పుడే కుటుంబం అనే రథం సజావుగా సాగుతుంది. అప్పుడే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

News January 8, 2026

హైటెక్ బరులు.. విజేతలకు బ్రెజా, థార్ కార్లు

image

AP: సంక్రాంతి కోడి పందేలకు నూజివీడు, గన్నవరం సరిహద్దుల్లో 28 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ బరులు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నిరంతరాయంగా పందేలు ఉంటాయంటూ ప్రముఖులకు ఆహ్వానపత్రికలూ అందజేస్తున్నారు. వీఐపీల కోసం 80 మంది బౌన్సర్లను రప్పిస్తున్నారు. రోజుకు రూ.కోట్ల పందేలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విజేతలకు బ్రెజా, థార్ కార్లను బహుమతులుగా ప్రకటించారు.