News July 31, 2024

వాటికి యునెస్కో గుర్తింపు తీసుకురావాలి: జాస్తి వీరాంజనేయులు

image

AP: రాష్ట్రంలో 129 కట్టడాల్లో ఒక్కదానికీ యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కలేదని అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గండికోట, అమరావతి, నాగార్జునకొండ, సాలిహుండం, శంకరం, అతి పెద్ద ఏకశిలా నంది, అతి పెద్ద 7 పడగల నాగేంద్రుడు, 856 స్తూపాల ఆలయం, వేలాడే ధ్వజస్తంభం, 12 ధ్వజస్తంభాలతో కూడిన నాట్య మండపాల గుర్తింపునకు ప్రభుత్వం క‌ృషి చేయాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

image

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.

News December 24, 2025

BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

image

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్‌ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.

News December 24, 2025

Money Tip: మీ జీతంలో EMIల వాటా ఎంత?

image

ప్రతినెలా సంపాదించే మొత్తంలో అప్పుల వాటా ఎంత ఉండాలో చెప్పేదే 40% EMI రూల్. ఇంటి అద్దె, తిండి, ఇతర ఖర్చులు పోనూ.. చేతికి వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి EMIలు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. హోం, పర్సనల్, కార్ లోన్లు.. అన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. అప్పుల భారం తగ్గించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. పొదుపు పెంచుకోవడానికి ఈ సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.