News August 6, 2025
వీరికి రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

AP: చేనేత దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ముగ్గురు ఏపీవాసులు అవార్డులందుకుంటారు. వెంకటగిరికి చెందిన జంఢాని చీరల తయారీలో కృషిచేసిన లక్క శ్రీనివాసులుకు ‘సంత్ కబీర్ హ్యాండ్లూం’ అవార్డు దక్కింది. మల్టీ డైమండ్ టై&డై సిల్క్ చీరలకు K.మురళి, డిజైన్ అభివృద్ధి చేసినందుకు J.నాగరాజుకు జాతీయ అవార్డులు దక్కాయి. మొత్తం ఐదుగురు సంత్ కబీర్, 19 మంది జాతీయ హ్యాండ్లూం అవార్డులకు ఎంపికయ్యారు.
Similar News
News August 6, 2025
ఇది అన్యాయం, అసమంజసం: భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తీరు అత్యంత దురదృష్టకరమని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయమని, అకారణమని, అసమంజసమని స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు చేపడుతుందని పునరుద్ఘాటించింది. ఇతర దేశాలు కూడా తమ జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు.
News August 6, 2025
ఇందిరా గాంధీని మోదీ ఆదర్శంగా తీసుకోవాలి: కాంగ్రెస్

ఇండియాపై టారిఫ్స్ను ట్రంప్ 50%కి పెంచడంతో PM మోదీపై కాంగ్రెస్ ఫైరైంది. ‘2019లో హౌడీ మోదీ ఈవెంట్ నుంచి పాక్తో సీజ్ఫైర్ వరకు ట్రంప్కు మోదీ మద్దతుగా నిలిచారు. అన్ని విషయాల్లో మౌనం పాటించారు. అయినా ట్రంప్ టారిఫ్స్ విధించడం మోదీ వైఫల్యమే. ఇందిరాగాంధీ USను ధైర్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఈగోను పక్కనపెట్టి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఫారిన్ పాలసీ మారాలి’ అని INC జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
News August 6, 2025
భారత్పై 50% టారిఫ్స్.. అమల్లోకి ఎప్పటినుంచంటే?

ఇటీవల భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని వైట్హౌస్ తెలిపింది. తాజాగా విధించిన 25శాతం అదనపు టారిఫ్లు 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 50శాతం సుంకాలు వర్తించనున్నాయి. ఫలితంగా ఆసియాలో చైనా(51శాతం) తర్వాత అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న దేశం భారతే కానుంది.