News October 24, 2024
రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?
TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News October 24, 2024
శారదా పీఠానికి భూముల కేటాయింపు రద్దు
AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.
News October 24, 2024
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా ప్రమాణం చేస్తారు. జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.
News October 24, 2024
తిన్న తర్వాత ఇలా చేస్తే..
పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఊబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కాఫీ, టీ తాగితే కడుపులో గ్యాస్, జీర్ణసంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మసాలాలు, మాంసాహారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనం చేశాక కచ్చితంగా కనీసం 100 అడుగులు వేయాలి.