News October 24, 2024
రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?

TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
నా వీర్యంతో పిల్లలను కంటే ఖర్చునాదే: దురోవ్

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న వాళ్లు తన వీర్యం ద్వారా IVFతో పిల్లలను కంటే ఖర్చులు భరిస్తానని ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఆయన ఇప్పటికే వంద మందికిపైగా పిల్లలకు తండ్రిగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అలాగే ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకు సమానంగా పంచుతానని గతంలోనే ప్రకటించారు.
News December 25, 2025
కర్ణాటక ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న 60 మంది చిన్నారులు!

కర్ణాటక బస్సు <<18664780>>ప్రమాదం<<>> నుంచి ఓ స్కూల్ బస్సు త్రుటిలో తప్పించుకుంది. ఆ ప్రైవేటు బస్సు వెనకే ఇది కూడా వెళ్తున్నట్లు తెలిసింది. లారీ-బస్సు ఢీకొనడంతో స్కూల్ బస్సు డ్రైవర్ వెంటనే పక్కకు తిప్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 60 మంది పిల్లలున్నారు. వారు బెంగళూరు నుంచి ఉత్తర కన్నడలోని దండేలికి ట్రిప్ వెళ్తున్నారు. మృతుల ఫ్యామిలీలకు ₹2 లక్షలు, క్షతగాత్రులకు ₹50 వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు.
News December 25, 2025
ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.


