News March 29, 2024
మార్చి 31లోపు చేయాల్సిన పనులివే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711686786688-normal-WIFI.webp)
* మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు రీకేవైసీ పూర్తి చేయాలి.
* బ్యాంకుల్లో ఆధార్, పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్డేట్ చేయాలి.
* ఐటీ రిటర్న్, అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయాలి.
* SBI అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది.
* గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీలు మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.
Similar News
News February 5, 2025
ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764377357_782-normal-WIFI.webp)
AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738768650269_367-normal-WIFI.webp)
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738768865728_367-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.