News November 13, 2024

ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలి: అనిత

image

AP: సొంత చెల్లి, తల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోతే, తాము అరెస్ట్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘మహిళలను ఏమైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. కానీ జగన్ సీఎం ఉన్నప్పుడు కొందరు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఎలాంటి వారికి మద్దతిస్తున్నారో జగన్ ఆలోచించుకోవాలి’ అని ఆమె సూచించారు.

Similar News

News November 21, 2025

విగ్రహాలను పూజించడం వెనుక సైన్స్

image

హిందూ మతంలో విగ్రహారాధనను ఎక్కువ ప్రోత్సహిస్తాం. అనేక దేవుళ్లు శిలలా మారడంతో విగ్రహాలే దైవాలని మనం వాటికి పూజలు చేస్తుంటాం. దేవుడు అందులో నుంచే మన మొరను వింటాడని అనుకుంటాం. అయితే ఈ విగ్రహారాధన ఆధ్యాత్మికంగా మనకు ఓ స్పెషల్ ఫోకస్‌ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రార్థన సమయంలో విగ్రహాన్ని చూస్తే.. మన ఆలోచనలు ఆయన రూపంతో అనుసంధానమైన మనల్ని భక్తి పథంలో నడిపిస్తాయని ఓ పరిశోధనలో తేల్చారు.

News November 21, 2025

AIIMS గువాహటిలో 177 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిమ్స్ గువాహటి 177 Sr. రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ (MD/MS/DNB), MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWSలకు రూ.500. వెబ్‌సైట్: https://aiimsguwahati.ac.in.

News November 21, 2025

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

image

HYDలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపుతూ ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. అన్నపూర్ణ సంస్థ ₹11.52L చెల్లించాల్సి ఉండగా కేవలం ₹49K చెల్లిస్తోందని, రామానాయుడు సంస్థ ₹2.73Lకి గాను ₹7,614 కడుతున్నట్లు సమాచారం.