News March 26, 2025
మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నా: నటాషా

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News March 26, 2025
జొమాటో, స్విగ్గీ షేర్ల పతనం.. కారణమిదే!

జొమాటో, స్విగ్గీ షేర్లు ఈరోజు తడబడ్డాయి. జొమాటో 5శాతం, స్విగ్గీ 1.88శాతం మేర తగ్గాయి. BoFA బ్రోకరేజీ సంస్థ వాటి రేటింగ్ను డౌన్గ్రేడ్ చేయడమే దీనిక్కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. జొమాటోను ‘కొనుగోలు’ నుంచి ‘న్యూట్రల్’కు, స్విగ్గీని ‘కొనుగోలు’ నుంచి ‘తక్కువ ప్రదర్శన’ స్థాయికి BoFA తగ్గించింది. ఫుడ్ డెలివరీ రంగాల్లో నష్టాల ఆధారంగా డౌన్గ్రేడ్ చేసినట్లు ఆ సంస్థ వివరించింది.
News March 26, 2025
పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
News March 26, 2025
యూజర్లకు షాక్: త్వరలో రీఛార్జ్ ధరల పెంపు?

త్వరలో వినియోగదారులకు టెలికామ్ కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను సవరించేందుకు కంపెనీలు సిద్ధమైనట్లు సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఈ ఛార్జీల పెంపు వల్ల టెలికాం కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని అంచనా వేసింది. 2019లో ఓసారి, 2021లో ఓసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు (2019 DECలో, 2021 NOVలో, 2024 JULYలో) టారిఫ్లను పెంచాయి.