News January 23, 2025
మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

చదువును కొందరు బిజినెస్గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్లో మూడో తరగతి ఫీజు షాక్కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News November 15, 2025
IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.
News November 15, 2025
బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

TG: కూకట్పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్వర్డులు సంపాదించారు. వందల హార్డ్డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
News November 15, 2025
పేలుడు పదార్థాల్లో రసాయనిక చర్యతోనే భారీ బ్లాస్టింగ్!

J&K నౌగామ్ పోలీసు స్టేషన్లో భారీ బ్లాస్టింగ్ ఉగ్రదాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఫరీదాబాద్(హరియాణా)లో వైట్కాలర్ టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న360 KGల కెమికల్ పేలుడు పదార్థాల్లో అత్యధిక భాగం ఈ PSలోనే ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి నుంచి శాంపిల్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు PTI పేర్కొంది. ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. PS తునాతునకలైంది.


