News April 29, 2024

మూడో దశ పోలింగ్.. 244 మందిపై క్రిమినల్ కేసులు

image

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ జరగనున్న 95 స్థానాల్లో 1352 మంది బరిలో ఉన్నారు. ఇందులో 123 మంది మహిళలు పోటీలో నిలిచారు. మొత్తంగా 244 మంది(18శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది. 172 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య, 38 మందిపై అత్యాచారం కేసులున్నాయి. కాగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మే 7న పోలింగ్ జరగనుంది.

Similar News

News November 15, 2025

గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందా?

image

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్‌ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News November 15, 2025

సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

image

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>

News November 15, 2025

బిహార్: ఓట్ షేరింగ్‌లో ఆర్జేడీనే టాప్

image

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.