News September 9, 2025
తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.
Similar News
News March 10, 2026
ఖరీఫ్కు ఎరువుల ఢోకా లేదు.. కానీ: FAI

రానున్న ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువులు ఉన్నాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. MAR 6 నాటికి 177.31L టన్నుల స్టాక్ ఉందని తెలిపింది. ఇందులో 59.30L టన్నుల యూరియా, 25.13L టన్నుల DAP, 55.87L టన్నుల NPKS ఉన్నట్లు పేర్కొంది. అయితే మిడిల్ ఈస్ట్ వార్, గ్యాస్ సరఫరాలో 40% కోత కారణంగా దేశీయంగా యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, దిగుమతి ఖర్చూ పెరుగుతుందని అభిప్రాయపడింది.
News March 10, 2026
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్పై ట్రంప్ రియాక్షన్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ ఎన్నికవడంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ అన్నారు. ఆయన సెలక్షన్ వల్ల ఇరాన్ మళ్లీ అదే సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అయతుల్లా అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబాను హత్య చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొత్త లీడర్గా ఎవరొచ్చినా ఎక్కువ కాలం ఉండబోరని.. వారినీ అంతం చేస్తామని అమెరికా గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
News March 10, 2026
గ్యాస్ సరఫరా లేక హోటళ్లు బంద్!

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిషేధించలేదని కేంద్రం స్పష్టం చేసినా గ్రౌండ్ లెవెల్లో సప్లై జరగడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. ‘సిలిండర్ల సరఫరాలో గృహాలకు ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం చెప్పడంతో అయోమయం నెలకొంది. దీనిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇవ్వాలి’ అని Xలో కోరింది. కాగా గ్యాస్ సరఫరా లేక ఇవాళ్టి నుంచి హోటళ్లు బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.


