News October 21, 2024
ఈ ఒప్పందం కీలక మైలురాయి: జైశంకర్

తూర్పు లద్దాక్లో పెట్రోలింగ్ విషయంలో భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందాన్ని కీలక మైలురాయిగా విదేశాంగ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. దీంతో అక్కడ 2020 ముందు నాటి తరహాలోనే ఇరు దేశాల బలగాలు పెట్రోలింగ్ చేపడతాయన్నారు. 2020 మేలో ఇరు దేశాల బలగాల మధ్య గాల్వన్ వ్యాలీలో జరిగిన ఫేస్-ఆఫ్లో 20 మంది భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


