News September 9, 2025
ఈ అల్పాహారం ఆరోగ్యానికి మేలు!

ఇడ్లీ, దోశ, ఉప్మా: పులియబెట్టిన పిండితో చేస్తారు కాబట్టి వీటిలో పోషకాలు, విటమిన్స్ ఎక్కువ.
పెసరట్టు, ఆమ్లెట్, మొలకలు: వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యానికి, ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది.
రాగి జావ, ఓట్స్: వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
పండ్లు, నట్స్, పెరుగు: వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
* పోషకాలు సమృద్ధిగా ఉండే అల్పాహారాన్ని తినడం మంచిది.
Similar News
News September 9, 2025
Way2News కాన్క్లేవ్: వైసీపీ నుంచి బుగ్గన, సజ్జల

AP: విజయవాడ CK కన్వెన్షన్లో ఈనెల 12న <<17649043>>Way2News కాన్క్లేవ్<<>> జరగనుంది. ఈ సదస్సుకు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే పదేళ్లకు గాను తమ ఆలోచనలు పంచుకోనున్నారు. దేశంలో డిజిటల్ మీడియా సంస్థ నిర్వహిస్తున్న తొలి కాన్క్లేవ్ ఇదే.
News September 9, 2025
INSPIRING: ట్రాన్స్జెండర్ నుంచి ఫొటో జర్నలిస్టు!

రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ట్రాన్స్జెండర్ జోయా థామస్ లోబో జీవితాన్ని పేపర్లో వచ్చిన ఫొటోగ్రాఫర్ కథనం మార్చేసింది. తానూ ఫొటోగ్రాఫర్ అవ్వాలని ఓ కెమెరా కొని దానితో ట్రాన్స్ల జీవితాలపై డాక్యుమెంటరీ చేశారు. ఓ మూవీలోని హిజ్రా పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవడంతో ఓ వార్తాసంస్థ రిపోర్టర్ ఉద్యోగం ఇచ్చింది. లాక్డౌన్లో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కట్టేలా తీసి ఫొటో జర్నలిస్టుగా మారారు.
News September 9, 2025
2035లో ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’: ఇస్రో ఛైర్మన్

ఇస్రో భవిష్యత్ కార్యాచరణ గురించి ఛైర్మన్ వి.నారాయణన్ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం ఉన్న వాటి కంటే 3 రెట్లు అధికంగా శాటిలైట్స్ను కక్ష్యల్లో ప్రవేశపెడతాం. చంద్రయాన్-4, 5 మిషన్స్పై దృష్టిపెట్టాం. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ స్థాపిస్తాం. 2028లో ఫస్ట్ మాడ్యూల్ పంపిస్తాం. 2040లో ఇండియా చంద్రుడిపై అడుగు పెడుతుంది. వీనస్ ఆర్బిటర్ మిషన్ చేపడతాం’’ అని మీడియాకు తెలిపారు.