News July 23, 2024
తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ స్పెషల్

తెలుగు రాష్ట్రాలకు ఈసారి కేంద్ర బడ్జెట్ కాస్త స్పెషల్. ఎందుకంటే మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి మన దగ్గర ఐదుగురు కేంద్ర మంత్రులున్నారు. NDA సర్కారులో AP ప్రభుత్వం భాగస్వామిగా ఉంది. TGలోనూ BJP అనూహ్యంగా పుంజుకుంటోంది. దీంతో ఇరు రాష్ట్రాలకు ‘మోదీ 3.0’ మునుపటి కంటే ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ బడ్జెట్లో ‘కేంద్ర మంత్రులు’ ఏమేరకు నిధులు తెప్పిస్తారో చూడాలి.
Similar News
News November 14, 2025
ఆ ఎకరం.. పోషకాల వరి వంగడాలకు నిలయం

యాదగిరి శ్రీనివాస్ పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సేద్యం చేస్తున్నారు. తనకు 3 ఎకరాల భూమి ఉండగా 2 ఎకరాల్లో సాధారణ రకాలను, మరో ఎకరంలో 400 వరి రకాలను సాగు చేస్తున్నారు. మంచి పోషక విలువలతో కూడిన తులసి బాసో, ఇతర ఎర్ర, నల్ల వరి రకాలు కూడా శ్రీనివాస్ భూమిలో పండుతున్నాయి. అవసరం మేరకు విత్తనాలను భద్రపరిచి.. ఆసక్తి ఉన్న రైతులకు విత్తనాలను అందిస్తూ, మిగిలిన వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు.
News November 14, 2025
250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కేబినెట్ సెక్రటేరియట్ 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, MScతో పాటు GATE ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. NOV 15 నుంచి DEC 14 వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోరు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66

ఈరోజు ప్రశ్న: వేద వ్యాసుని ద్వారా జన్మించిన వారిలో ధృతరాష్ట్రుడు, పాండురాజులతో పాటు విదురుడు కూడా ఒకరు. కానీ, ఆయన హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా, కేవలం రాజభవనంలో ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


