News January 29, 2025
ఈ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే.. ఏమంటారు?

కేరళలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్షీట్పై వారాన్ని మెన్షన్ చేయడాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రశంసించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ట్వీట్ చేశారు. వారంతో పాటు రంగులను ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ ఫొటోలు పంచుకున్నారు. దీనిపై అభిప్రాయం తెలపాలని కోరారు. ఇలా వారాన్ని మెన్షన్ చేస్తే రోజూ బెడ్షీట్ చేంజ్ చేస్తారు.
Similar News
News October 28, 2025
తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.
News October 28, 2025
వరదల సమయం.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

భారీ తుఫానులు, వరదలు సంభవించినప్పుడు రైతులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో, పశువులను అలాగే కట్టేసి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారు. అవి వరద నీరు వల్ల ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వరదల సమయంలో పశువులను పాకల్లో కట్టకుండా వదిలేయాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పశువులను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాటికి కొంత మేతను అందించాలి.
News October 28, 2025
వరదల తర్వాత పశువుల సంరక్షణకు సూచనలు

వరదల వల్ల పశువులకు గాయాలైతే వెంటనే చికిత్స చేయించాలి. వర్షాలు తగ్గిన తర్వాత పశువులకు కావలసిన మేత, నీరు సమృద్ధిగా అందించాలి. వ్యాధుల తీవ్రత తగ్గించడానికి పశువులకు టీకాలు వేయించాలి. పశువులు చనిపోతే కాల్చివేయాలి. బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు క్రిమిసంహారక మందులను వాడాలి. నీటిని శుభ్రం చేసి పశువులకు ఇవ్వాలి. పశువులను కట్టే చోట నీరు నిల్వ లేకుండా చూడటంతో పాటు దోమలు, ఈగల నిర్మూలనకు కృషి చేయాలి.


