News September 23, 2025

ఈ ఆహారంతో క్యాన్సర్ దరిచేరదు: వైద్యులు

image

పీచు పదార్థాలు నిండిన ఆహార పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘పప్పులు, బీన్స్, చిరుధాన్యాలు, నట్స్, ఆకుకూరల్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు బ్యాక్టీరియాను పోషిస్తాయి. శరీరంలో వాపును తగ్గించే సమ్మేళనాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. పీచు పేగులోని వ్యర్థాలను తొలగించి హానికర క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. బరువు, రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి’ అని సూచించారు.

Similar News

News September 23, 2025

వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.

News September 23, 2025

YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

image

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.

News September 23, 2025

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

image

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.