News February 1, 2025

ఇది దేశ గతినే మార్చే బడ్జెట్: బండి సంజయ్

image

TG: కేంద్ర బడ్జెట్ దేశ గతినే మార్చుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది. బడ్జెట్‌పై విపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించాలి’ అని అన్నారు. అలాగే, ఇది ప్రజారంజక బడ్జెట్ అని MP DK అరుణ కొనియాడారు. రూ.12లక్షల వరకు IT కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని చెప్పారు.

Similar News

News February 19, 2026

అతి గొప్ప పురుషుడు ఎవరంటే?

image

తనలోని కోపాన్ని తానే జయించినవాడు అతి గొప్ప పురుషుడు అవుతాడని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ‘కోపం తనకే ప్రమాదకారి అని, అది తన మొదటి శత్రువని గుర్తించి, పాము తన ఒంటిపై ఉన్న కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా దానిని వదిలించుకోవాలి. కోపం వచ్చినప్పుడు పరీక్షించుకుని, మౌనం పాటించి ఆవేశాన్ని విడనాడేవాడే ఉత్తముడు. తనలోని ఉద్వేగాలను నియంత్రించుకోగలిగిన వాడే అందరికంటే శక్తిమంతుడు’ అని వివరించారు.

News February 19, 2026

హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు.. ₹70,000 కోట్లకు లెక్క లేదు!

image

హైదరాబాద్ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ ₹70,000 కోట్ల మేర సేల్స్ లెక్కల్లో చూపలేదని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. బిల్స్ డిలీట్, ఎడిటింగ్ వంటివి చేస్తూ తక్కువ సేల్ చూపించి పన్ను ఎగ్గొడుతున్నట్లు గుర్తించింది. బిల్లింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ డేటాను Ai సహా లేటెస్ట్ టూల్స్‌తో విశ్లేషించగా ఇది తెలిసింది. 2019-20 సం. నుంచి విశ్లేషించిన 10% డేటాతో TN, KA, TG, MH, GJ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తేలింది.

News February 19, 2026

రేపు ఢిల్లీ ఏఐ సమ్మిట్‌కు CM చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. IBM, UNICC, NIELIT సంస్థలతో ఈ ఒప్పందాలు జరగనున్నాయి. UK మంత్రి, ఆరామ్‌కో ఇండియా, అడోబ్ ఇండియా సీఈఓలతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు.