News April 13, 2025

ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ: హరీశ్ రావు

image

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్‌లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని ఫైరయ్యారు. ఇది INC ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. వారి మృతదేహాలను ఎప్పటికి బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 14, 2025

BJP అంబేడ్కర్‌కు శత్రువు : మల్లికార్జున్ ఖర్గే

image

బీజేపీ, RSS భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు శత్రువులని AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 1952 ఎన్నికల్లో ఆయన ఓటమికి V.Dసావర్కర్, SA డాంగే కారణమన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా ఓ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ SC, ST, OBCలకు రిజర్వేషన్లు అమలు చేసే చర్యలు చేపట్టాలని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.

News April 14, 2025

రూ.75 లక్షలు తీసుకుని నితిన్ హ్యాండిచ్చాడు: నిర్మాత

image

హీరో నితిన్‌పై నిర్మాత, డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండిచ్చారని చెప్పారు. ఆ సమయంలో ‘అఆ’ పెద్ద హిట్టవడంతో వశిష్ఠతో చేస్తే రేంజ్ పడిపోతుందని వద్దన్నారని పేర్కొన్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు. తర్వాత వశిష్ఠ ‘బింబిసార’తో హిట్ కొట్టాడని చెప్పారు.

News April 14, 2025

అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

image

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!