News April 5, 2024
ఇది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో: రాహుల్

కాంగ్రెస్ రిలీజ్ చేసింది రైతులు, మహిళలు, శ్రామికుల మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులెలా సమకూర్చుకుందో బయటపడిందన్నారు. పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రయోజనాల కోసం సీబీఐ, ఈడీని ప్రయోగించి బెదిరింపులకు పాల్పడిందని రాహుల్ విమర్శించారు.
Similar News
News November 27, 2025
ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.
News November 27, 2025
సొరకాయల కోత ఎప్పుడు చేపడితే మంచిది?

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
News November 27, 2025
12 గంటల్లో తుఫాన్.. భారీ వర్షాలు: APSDMA

AP: సెన్యార్ తుఫాన్ <<18394233>>ముప్పు<<>> తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి TN, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.


