News December 16, 2024
ఇది అరాచక ప్రభుత్వం: KTR

TG: భూములు ఇవ్వని రైతులను అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినవారినీ జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా సీఎం రేవంత్ పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నది అరాచక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన KCR ఉన్నారని, BRS వారి తరఫున పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 15, 2026
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.
News January 15, 2026
53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు ప్రయాణం

53 ఏళ్ల తర్వాత మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు చేరనున్నారు. నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్లో నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ వచ్చే నెల 6న ప్రారంభమై 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి వస్తారు. 1972లో చేపట్టిన అపోలో తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఆర్టెమిస్-3 ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లనున్నారు.
News January 15, 2026
ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 17న కాకినాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు. మరోవైపు సంక్రాంతి నేపథ్యంలో నారావారిపల్లెలో ఉన్న ఆయన క్లస్టర్ యూనిట్పై సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఆదాయం వచ్చేలా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిల్లో ఇంటర్నెట్, క్యాబిన్లు, క్యాంటిన్ తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు.


