News January 16, 2025
ఆసియన్ గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే: స్పోర్ట్స్కీడా

ఆసియాలో 21వ శతాబ్దపు టెస్టు క్రికెట్లో గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే అంటూ ‘స్పోర్ట్స్ కీడా’ ఓ టీమ్ను ప్రకటించింది. ఈ జట్టుకు జయవర్ధనే కెప్టెన్గా ఉన్నారు. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, సంగక్కర, అశ్విన్, రంగనా హెరాత్, షోయబ్ అక్తర్, జస్ప్రిత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్, కోహ్లీని 12వ ప్లేయర్గా ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్లో మీ టీమ్-11 ఎవరో కామెంట్ చేయండి.
Similar News
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News October 22, 2025
బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.
News October 22, 2025
భారీ వర్షసూచన.. మరో 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: రాయలసీమతో పాటు పలు జిల్లాలకు వాతావరణశాఖ రేపు భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో మరో 2 జిల్లాల స్కూళ్లకు సెలవులిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కడప డీఈవో శంషుద్దీన్, అన్నమయ్య డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ GNT, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.