News July 23, 2024
ఇదీ చంద్రబాబంటే: టీడీపీ శ్రేణుల సంబరాలు

AP: అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత చంద్రబాబు సమర్థతతోనే కేంద్రం ఈ నిధులిచ్చిందని కొనియాడుతున్నాయి. ‘విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదు. వ్యూహాత్మకంగా ఎన్డీయేలో చేరడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారు’ అంటూ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 28, 2025
లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.
News October 28, 2025
వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.
News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.


