News March 26, 2024

ఇది BRS తెచ్చిన కరువే: మంత్రి సీతక్క

image

TG: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే వర్షాలు ఆగిపోయాయని ఆమె అన్నారు. ‘గత BRS ప్రభుత్వం చెరువుల పూడికతీతకు రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. మరి ఇప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు ఎందుకు లేవు. ఈ కరువు బీఆర్ఎస్ తెచ్చిందే’ అని ఆమె అన్నారు.

Similar News

News March 17, 2026

హోటల్స్ మూత… అన్న క్యాంటీన్లకు తాకిడి

image

AP: నిన్న మొన్నటి వరకు కొద్దోగొప్పో తెరిచి ఉన్న హోటళ్లు వాణిజ్య LPG కొరతతో మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అన్న క్యాంటీన్లపై పడుతోంది. ఇదివరకు ఒక్కో క్యాంటీన్‌ ద్వారా మధ్యాహ్నం 500మందికి మీల్స్ అందించేవారు. హోటల్స్ మూతతో అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో 3PM వరకు మీల్స్ అందించగా ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులూ వస్తుండడంతో 2PMకల్లా భోజనాలు అయిపోతున్నట్లు చెబుతున్నారు.

News March 17, 2026

ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

image

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.