News September 3, 2025
కాపు దశలో వంగ, బెండలో చీడల నివారణ ఇలా!

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.
Similar News
News September 5, 2025
యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

AP: రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్- NTR వైద్య సేవ కింద <<17610266>>హెల్త్ పాలసీ<<>> ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ కింద..
* EHS వర్తించేవారికి కాకుండా మిగతావారికి వైద్యసేవలు
* జర్నలిస్టుల కుటుంబాలకూ వర్తింపు
* తొలుత ఆస్పత్రి ఖర్చులు బీమా కంపెనీలు చెల్లించనుండగా, ఆపై ప్రభుత్వం వాటికి అందిస్తుంది.
* ఖర్చులను 15రోజుల్లోగా చెల్లించాలని నిర్ణయం
* RFP విధానంలో రోగి చేరిన 6గంటల్లో అప్రూవల్.
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.
News September 5, 2025
సెప్టెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

1884: ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు కె.గోపాలకృష్ణమాచార్యులు జననం
1888: భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం(ఫొటోలో)
1955: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం.కోదండరాం జననం
1995: తెలుగు హాస్య నటి గిరిజ మరణం
1997: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం