News March 25, 2024
వైసీపీ కాలకేయులకు ఇదే నా హెచ్చరిక: లోకేశ్

AP: జగన్ గొడ్డలితో తెగబడితే, YCP కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘సత్యసాయి జిల్లా కుటాలపల్లిలో TDP కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. అది ముమ్మాటికీ YCP సైకోల పనే. ఓటమి భయంతో మా కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారు. YCP కాలకేయులకు ఇదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News December 7, 2025
సైనికుల క్రమశిక్షణ, సామర్థ్యం చూశాం: రాజ్నాథ్ సింగ్

‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైనికుల సామర్థ్యం, క్రమశిక్షణ చూశామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పరాక్రమంతో పాటు సంయమనం కూడా చూపారని గుర్తుచేశారు. ఎంత కావాలో అంతే చేశారని, అనుకుంటే మరింత చేసేవారన్నారు. బార్డర్లో మెరుగైన కనెక్టివిటీ భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతోందని చెప్పారు. BRO పూర్తి చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్నాథ్ ఈ కామెంట్లు చేశారు.
News December 7, 2025
YCP ‘కోటి సంతకాలు’లో మార్పులు: సజ్జల

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటన వల్ల 16న గవర్నర్ షెడ్యూల్ మారింది. ఆరోజుకు బదులు 17న పార్టీ చీఫ్ జగన్, నేతలు గవర్నర్ను కలుస్తారు. ఇక జిల్లాస్థాయి ర్యాలీలు 13కు బదులు 15న జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. నియోజకవర్గాల్లో నిర్ణీత 10న కార్యక్రమాలు నిర్వహించాలి’ అని చెప్పారు.
News December 7, 2025
రెండేళ్ల పాలనలో చేసింది మోసమే: కిషన్ రెడ్డి

TG: హామీలు అమలు చేయకుండా రేవంత్ ఉత్సవాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘CM చెప్పేది ఫ్రీ బస్సు, సన్నబియ్యం గురించే. KG బియ్యంలో కేంద్రం ₹43 భరిస్తోంది. పోలీసుల్ని పెట్టుకొని గ్రామాల్లో తిరగడం కాదు. హామీలపై చర్చకు రండి’ అని సవాల్ విసిరారు. రెండేళ్ల పాలనలో అందర్నీ మోసగించారని విమర్శించారు. మహాధర్నాలో నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు.


