News September 3, 2024

దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ఇదీ ఓ కారణమే!

image

భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల ముఖ్య కారణాలలో ఒకదాని గురించి ఓ రైల్వే అధికారి చెప్పుకొచ్చారు. ‘1845లో మొదటి ఆంగ్లో- సిక్కు యుద్ధం జరిగినప్పుడు దేశంలో రైళ్లు అందుబాటులో లేవు. ఆ సమయంలో దళాలను కోల్‌కతా నుంచి బెనారస్‌కు తరలించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 16 రోజులు పట్టింది. దీంతో వేగవంతమైన సరఫరా కోసం రైలు ముఖ్యమని భావించి తీసుకొచ్చారు’ అని Xలో తెలిపారు.

Similar News

News February 3, 2025

విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్

image

సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్‌కి ఫ్యాన్స్‌కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

News February 3, 2025

టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

image

* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్‌పై)
* శుభ్‌మన్ గిల్- 126*(న్యూజిలాండ్‌పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్‌పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్‌పై)