News April 1, 2024

నియంత పాలనకు ఇదే నిదర్శనం: సీతక్క

image

TG: దేశంలో నియంత పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. నిన్న అద్వానీకి భారత రత్న ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఆయన పక్కనే కూర్చొని ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిల్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆదివాసీ మహిళను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

8th క్లాస్‌తోనే ఐటీఐ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 8వ తరగతిలోనే చదువు ఆపేసిన వారు జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8th క్లాస్ పాసైన వారూ ITI కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని HRD శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వారు ఇక్కడ చదువుతూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో టెన్త్ పాసయ్యేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే వృత్తి పనులు చేస్తున్నవారి స్కిల్స్ పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.

News March 13, 2026

సెలవు తేదీ మార్పు

image

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.