News March 18, 2024
‘కీడా కోలా’లో ఎస్పీ బాలు పాటపై తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే..

‘కీడా కోలా’ మూవీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించారు. బాలు కుమారుడు చరణ్ లీగల్ నోటీసులు పంపింది నిజమేనా? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. ఇద్దరివైపు నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పారు. గొప్ప కళాకారులను అమర్యాద పరచాలనే ఉద్దేశం ఎవరికీ ఉండదని.. ప్రస్తుతం అంతా సర్దుకుందని బదులిచ్చారు.
Similar News
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 16, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>


