News October 24, 2024
పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల విధానం ఇదే
AP: పింఛను లబ్ధిదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఆరంచెల విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులకు వ్యవసాయ భూమి 10ఎకరాలకు మించొద్దు. ఇంట్లో ప్రభుత్వ జాబ్, 4 వీలర్ వెహికల్, IT చెల్లింపు, విద్యుత్ మీటర్ రీడింగ్ 6నెలలకు సరాసరిన 300 యూనిట్లకు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చ.అడుగుల పైన నివాసం ఉండొద్దు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News October 24, 2024
STOCK MARKET: జంకుతున్న ట్రేడర్స్
దేశీయ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. దీంతో ఇన్వెస్టర్లు దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. సెన్సెక్స్ 80,151 (69), నిఫ్టీ 24,441 (6) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, METAL సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, ఫైనాన్స్ సూచీలు పుంజుకున్నాయి. HUL, హిందాల్కో, SBI LIFE, నెస్లే, AIRTEL టాప్ లూజర్స్. గ్రాసిమ్, కోల్ఇండియా ఎగిశాయి.
News October 24, 2024
తీవ్రరూపం దాల్చిన తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
AP: ‘దానా’ తుఫాన్ వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారిందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు భితార్కానికా-ధమ్రా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దానా ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 24, 2024
డాలర్కు చెక్ పెట్టే BRICS కరెన్సీ నోటు ఇదే!
BRICS అధికారిక కరెన్సీ నమూనా నోట్లు విడుదలయ్యాయి. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వీటిని అందరికీ చూపించారు. ‘BRICS bill’గా పిలుస్తున్న నోటు ముందు వైపున భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికా జాతీయ పతాకాలు ప్రింట్ చేశారు. వాటిపై తాజ్మహల్, డ్రాగన్ వంటి చిహ్నాలకు చోటిచ్చారు. వెనుకవైపు కొత్త సభ్యదేశాల పేర్లు, జెండాలు ఉన్నాయి. ఇవి డాలర్ డామినేషన్కు చెక్ పెడతాయని విశ్లేషకుల అంచనా. మీ comment.