News October 24, 2024
పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల విధానం ఇదే

AP: పింఛను లబ్ధిదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఆరంచెల విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులకు వ్యవసాయ భూమి 10ఎకరాలకు మించొద్దు. ఇంట్లో ప్రభుత్వ జాబ్, 4 వీలర్ వెహికల్, IT చెల్లింపు, విద్యుత్ మీటర్ రీడింగ్ 6నెలలకు సరాసరిన 300 యూనిట్లకు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చ.అడుగుల పైన నివాసం ఉండొద్దు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News October 17, 2025
కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM

TG: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల తరహాలో తీర్చిదిద్దాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. స్కూళ్లలో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ‘తొలి దశలో ORR లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై దృష్టి పెట్టండి. సరైన సౌకర్యాలు లేని స్కూళ్లను దగ్గర్లోని ప్రభుత్వ స్థలాలకు తరలించండి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించండి’ అని సూచించారు.
News October 17, 2025
ఫిట్మ్యాన్లా మారిన హిట్మ్యాన్

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు రెడీ అవుతున్నారు. తాజా ఫొటో షూట్లో రోహిత్ సన్నగా కనబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫొటో షూట్లో లావుగా ఉన్న రోహిత్.. వర్కౌట్స్ చేసి సన్నబడ్డారు. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన హిట్మ్యాన్.. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News October 17, 2025
కాంగ్రెస్, MIM అన్ని హద్దులూ దాటాయి: బండి

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు MIM మద్దతివ్వడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కాంగ్రెస్, MIM సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. BJP, MIM ఒక్కటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో కూర్చుంది. BJP ఒంటరిగా పోటీ చేస్తోంది. MIMకు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. మీరేం చేసినా మేమే గెలుస్తాం. ప్రజలు ఓట్లతో జవాబిస్తారు’ అని ట్వీట్ చేశారు.