News October 24, 2024

పింఛన్లకు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల విధానం ఇదే

image

AP: పింఛను లబ్ధిదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఆరంచెల విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం దరఖాస్తుదారులకు వ్యవసాయ భూమి 10ఎకరాలకు మించొద్దు. ఇంట్లో ప్రభుత్వ జాబ్, 4 వీలర్ వెహికల్, IT చెల్లింపు, విద్యుత్ మీటర్ రీడింగ్ 6నెలలకు సరాసరిన 300 యూనిట్లకు మించి ఉండకూడదు. పట్టణాల్లో 1000 చ.అడుగుల పైన నివాసం ఉండొద్దు. ఈ విధానాన్ని ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News

News November 14, 2025

వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

image

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News November 14, 2025

‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.

News November 14, 2025

కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కిషన్ రెడ్డి తానే స్వయంగా అభ్యర్థిగా మారినా డిపాజిట్ దక్కించుకోలేకపోయారని CM రేవంత్ ఎద్దేవా చేశారు. ‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం. ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.