News March 23, 2024

20 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి

image

రష్యాలోని ఓ షాపింగ్ మాల్‌‌లో ఉగ్రవాదుల నరమేధంతో 62 మంది పౌరులు <<12907109>>మరణించడం<<>> సంచలనంగా మారింది. మాస్కోలో 2002 తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 1999లో ఓ భవనంపై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఒకే రోజు 118 మంది మరణించారు. రెండు వారాలపాటు సాగిన కాల్పుల్లో మొత్తం 293 మంది చనిపోయారు. 2002లో ఓ థియేటర్‌లో దాడి జరగగా 130 మంది దుర్మరణం పాలయ్యారు. 2003లో 15, 2004లో 41, 2010లో 40, 2011లో 37 మంది చనిపోయారు.

Similar News

News November 13, 2025

2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

image

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

News November 13, 2025

ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

image

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.

News November 13, 2025

ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

image

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్‌ఫర్డ్ సొంతం.