News March 23, 2024

20 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి

image

రష్యాలోని ఓ షాపింగ్ మాల్‌‌లో ఉగ్రవాదుల నరమేధంతో 62 మంది పౌరులు <<12907109>>మరణించడం<<>> సంచలనంగా మారింది. మాస్కోలో 2002 తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 1999లో ఓ భవనంపై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఒకే రోజు 118 మంది మరణించారు. రెండు వారాలపాటు సాగిన కాల్పుల్లో మొత్తం 293 మంది చనిపోయారు. 2002లో ఓ థియేటర్‌లో దాడి జరగగా 130 మంది దుర్మరణం పాలయ్యారు. 2003లో 15, 2004లో 41, 2010లో 40, 2011లో 37 మంది చనిపోయారు.

Similar News

News July 8, 2024

సేవామూర్తికి ‘సేవారత్న’ అవార్డు!

image

రూపాయికే ఇడ్లీలను అందిస్తూ ఎంతోమంది కడుపు నింపుతోన్న TNకి చెందిన 84 ఏళ్ల కమలతల్‌ను ఏపీ, TG రాష్ట్రాల మంత్రులు సత్కరించారు. ఓ ప్రైవేటు అవార్డుల వేడుకలో ఆమెను ‘సేవారత్న’తో సత్కరించి రూ.50వేల సాయాన్ని అందించారు. గత 35 ఏళ్లుగా ఆమె రూ.1కే ఇడ్లీలు అందిస్తున్నారు. 600ప్లేట్లు విక్రయిస్తూ తన అవసరాల కోసం రూ.100 చొప్పున ఆదా చేస్తున్నారు. ఆమెను అభినందించాల్సిందేనంటూ IAS జయేశ్ రంజన్ ఫొటోలను Xలో పంచుకున్నారు.

News July 8, 2024

బియ్యం, కందిపప్పు ధరలు తగ్గిస్తాం: మంత్రి నాదెండ్ల

image

AP: నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.181 ఉంటే రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున రైతు బజార్లలో గురువారం నుంచి విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.

News July 8, 2024

YS దృష్టిని ఆకర్షించాలని చూసేవాడిని: రేవంత్

image

మాజీ CM YSRతో తనకు భిన్నమైన అనుభవాలున్నాయని TG CM రేవంత్ తెలిపారు. ‘2007లో MLCగా తొలిసారి అసెంబ్లీకి వెళ్లా. YS దృష్టిని ఆకర్షించాలని, సమస్యలను ప్రస్తావించి బలమైన వాదనలు వినిపించాలని రాత్రంతా చదువుకునేవాడిని. 2009లో MLA అయ్యా. అప్పుడు కూడా బడ్జెట్‌పై నేను మాట్లాడితే పిల్లవాడినని కాకుండా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన సమాధానం ఇచ్చేవారు’ అని మంగళగిరిలో YS జయంతి ఉత్సవాల్లో రేవంత్ గుర్తు చేసుకున్నారు.