News September 12, 2024

ఐఫోన్‌ను అత్యధికంగా కొనేది ఈ దేశంలోనే

image

యాపిల్ రూపొందిస్తున్న ఐఫోన్‌ను జపనీయులు ఎక్కువగా కొంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆ దేశంలో 59 % మంది దీనిని వాడుతున్నారు. ఆ తర్వాత కెనడా (56%), ఆస్ట్రేలియా (53%), అమెరికా (51%), యూకే (48%), ఇటలీ (30%), స్పెయిన్ (29%), చైనా (21%), మెక్సికో (20%), ఉన్నాయి. కాగా ఇండియాలో 5 శాతం మంది మాత్రమే ఐఫోన్ ఉపయోగిస్తున్నారు. 19 % మంది సామ్‌సంగ్, 76 % మంది ఇతర ఫోన్లు వాడుతున్నారు. మీ ఫోన్ ఏదో కామెంట్ చేయండి.

Similar News

News December 2, 2025

IPL మినీ ఆక్షన్.. 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్

image

ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం 14 దేశాల నుంచి 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. వీరిలో మయాంక్ అగర్వాల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ చాహర్, కేఎస్ భరత్, పృథ్వీషా తదితరులు ఉన్నారు. భారత్ నుంచి కేవలం రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్.. గ్రీన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్ తదితర 47 మంది ఫారిన్ ప్లేయర్లే రూ.2కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.

News December 2, 2025

హైదరాబాద్‌లో అజయ్​ దేవ్​గన్​ ఫిల్మ్​ సిటీ!

image

TG: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ వేదిక కానుంది. HYDలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు. అలాగే నైట్ సఫారీ ఏర్పాటుకు రిలయన్స్‌కు చెందిన వనతార యానిమల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ ముందుకొచ్చింది. ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మాణానికి ఒప్పందం చేసుకోనుంది.

News December 2, 2025

భారత్‌పై పాక్ మీడియా అసత్య ప్రచారం

image

తుఫానుతో నష్టపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు గగనతల అనుమతులివ్వాలని సోమవారం 1PMకు పాక్ కోరగా 4గంటల్లోనే IND ఒప్పుకుంది. అయితే పర్మిషన్ ఇవ్వలేదని పాక్ మీడియా ప్రచారం చేయడాన్ని భారత్ ఖండించింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని, PAK మీడియా నివేదికలు బాధ్యత రాహిత్యమైనవని పేర్కొంది. గగనతల అనుమతుల విషయంలో సాంకేతిక, భద్రతా అంచనాలనే IND పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో నిరాకరణ ఉండదని చెప్పింది.